ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుని సముద్రుఁడు పూజించి వచ్చినపనిఁ దెలియఁ జెప్పు మనుట
; నెదురేఁగి జలరాశి మ్రొక్కి
యనుపమ దివ్యరత్నాళిఁ బూజించి
“తామరసాక్ష! మాధవ! లోకవంద్య!
ఏమి విచ్చేసితి రెఱిఁగింపు?” మనుఁడు;
“తొడరి మా గురువు పుత్రుని మ్రింగినాఁడ
వుడుకకఁ దెచ్చి మాకొప్పించు” మనిన;
“నాకేమిపని యిది? నాలోననుండి
భీకరాకారుండు పృథుకంపురూపుఁ - 310
డగు రాక్షసుఁడు మ్రింగె” నని చెప్ప శౌరి
యగణితశక్తిని యంబోధి నుఱికి
వేదచోరునిఁ దొల్లి విదళించు భంగి
నా దుష్టదనుజుని యడగించి వాని
కడుపులో నున్న శంఖము పుచ్చుకొనుచు
తడయక వెడలి రథంబెక్కి కదలి